Posted on 2025-10-28 12:49:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న కు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాస రమేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు గా ప్రకటించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలిపారు . నామీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్ప చెప్పినందుకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సూచించిన విధంగా ముందుకు వెళ్తానని అన్నారు. ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఆకుల హనుమాన్లు కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుంతుల సందీప్, పటేలసుదవోయిన సతీష్ గౌడ్, రవిరాజ్ ముదిరాజ్, భాస్కర్ మాల, శంకర్ పటేల్, శ్యామ్ మాదిగ, రవి రాజ్ బట్టు, రాజ్, అశోక్ నాయక్, ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >