| Daily భారత్
Logo




నవంబర్ 15 న ప్రత్యేక లోక్ అదాలత్

News

Posted on 2025-11-01 15:28:24

Share: Share


నవంబర్ 15 న ప్రత్యేక లోక్ అదాలత్

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లు వెల్లడి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తు నవంబర్ 15 న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు లతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. రాజీపడదగిన 1328 క్రిమినల్ కేసులను గుర్తించామని , వాటిని లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విబేధాలు వచ్చినప్పుడు సర్దుకుని రాజీ మార్గంలో వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఆర్మూర్ , బోధన్ కోర్టు ప్రాంగణాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని ఆమె వివరించారు. లోక్ అదాలత్ వైపు వెళ్లే మార్గానికి కక్షిదారులను ప్రోత్సహించాలని పౌర సమాజానికి  జిల్లా జడ్జి విజ్ఞప్తి చేశారు. మనిషి సంఘజీవి అని సమాజంలో అందరితో కలిసి శాంతియుతంగా జీవించే సమయాలలో సమస్యల విషవలయంలో చిక్కుకోరాదని ఆమె అన్నారు. శాంతియుత సహజీవనమే ప్రజల జీవన విధానంగా మారాలని ఆమె సూచించారు. ప్రజల న్యాయపరమైన వివాదాలు, త్వరితిగతిన రాజీపద్దతి విధానంలో పరిష్కరించుకోవడానికి న్యాయసేవల చట్టం అత్యుత్తమని జిల్లా జడ్జి భారత లక్ష్మీ తెలియజేశారు. 

అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ స్పెషల్ లోక్ అదాలత్ కు పోలీసు శాఖ సంపూర్ణ మద్దతునిస్తు, విజయవంతానికి కృషి చేస్తుందని తెలిపారు. చిన్న చిన్న క్రిమినల్ కేసులు, క్షణిక ఆవేశంలో చేసిన రాజీ పడదగిన కేసులు స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలనిఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మానస పుత్రిక " స్పెషల్ లోక్ అదాలత్ " అని ఆయన అభివర్ణించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి తో కలిసి, సమన్వయము చేసుకుంటు ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి ప్రత్యేక కార్యాచరణతో కలిసి నడుస్తున్నామని ఆయన అన్నారు. అందరి దారులు ప్రత్యేక లోక్ అదాలత్ వైపు కదలాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆకాంక్షించారు. తదుపరి న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ న్యాయవాదులను , న్యాయమూర్థులను , పోలీసు అధికారులను సమన్వయం చేసుకుంటు న్యాయ వివాదాలను న్యాయార్థుల అభీష్టం మేరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >