Posted on 2025-11-06 13:37:33
డైలీ భారత్,సిద్దిపేట:ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంపల్లి గ్రామానికి చెందిన పెద్దమనిషి బాల మల్లయ్య విద్యార్థులతో మాట్లాడుతూ.
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు నేను మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అని అన్నారు.
బాల మల్లయ్య మాట్లాడుతుండగా విద్యార్థులు శ్రద్ధగా వింటూ, ఆయన మాటలతో ఆకట్టుకుని, చప్పట్లతో ప్రాంగణం మార్మోగించడం గమనార్హం.
ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు చట్టబద్ధంగా లైసెన్స్ పొంది మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.
ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. చిన్న తప్పిదం కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి ట్రాఫిక్ రూల్స్ను గౌరవించి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >