| Daily భారత్
Logo




పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి, అమలు చేయాలి!

News

Posted on 2025-11-13 18:30:40

Share: Share


పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి, అమలు చేయాలి!

టీచర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి!!

చకినాల అనిల్ కుమార్ టీపీటీఎఫ్ (TPTF) రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్

 డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా లో  సిరిసిల్ల, వేములవాడ మండలంలో TPTF బాధ్యుల ఆధ్వర్యంలో మండలంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై టీచర్లతో సమావేశాలను నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన టిపిటిఎఫ్ (TPTF) రాష్ట్ర అధ్యక్షులు చకినాలు అనిల్ కుమార్ మాట్లాడుతూ గత పిఆర్సి గడువు ముగిసి రెండేళ్లు గడిచినప్పటికీ కొత్త కమిషన్ రిపోర్టును బహిర్గతపరిచి PRC ప్రకటించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు. ఉద్యోగులకు వెంటనే PRC ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు హక్కుగా రావలసిన వివిధ రకాల ఆర్థిక బిల్లులను ప్రభుత్వం సంవత్సరాల తరబడి చెల్లించకుండా  ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. పెండింగ్లో ఉన్న టీచర్ల ఆర్థిక బిల్లులను మరియు డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను తరగతిగది బోధనకు దూరం చేసే రకరకాల  శిక్షణలను మరియు  ఆన్‌లైన్‌ కార్యక్రమాలను విద్యాశాఖ రద్దు చేయాలని, పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం డిప్యూటేషన్ పద్ధతిలో టీచర్లను నియమించకూడదని కోరారు. కేజీబీవీ టీచర్ల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని,మాడల్ స్కూలు గురుకుల టీచర్లకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు .పెన్షనర్ల పెన్షనరీ ప్రయోజనాలను  వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులను జారీ చేయాలని కోరారు.ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, ఉపాధ్యాయులు TPTF నిర్వహించబోయే ఉద్యమాలలో అధిక సంఖ్యలో పాల్గొని సమస్యల పరిష్కారానికి కదిలి రావాలని కోరారు.

ఈ సమావేశాలలో టీపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమానాద్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య , జిల్లా ఉపాధ్యక్షులు పర్వతి తిరుపతి, వేములవాడ అర్బన్ అధ్యక్షులు బొజ్జ కృష్ణ, మహేష్, సిరిసిల్ల మండల అధ్యక్షులు జగిత్యాల శ్రీనివాస్, వేణు,  శ్రీనివాస్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >