Posted on 2025-11-13 14:03:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: టీ ఎస్ యూ టి ఎఫ్ ( తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) సిరిసిల్ల మండల అధ్యక్షులు గా వంగ మల్లేశం ,ప్రధానకార్యదర్శి గా దాసరి చంద్రశేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పిహెచెస్ అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల పాఠశాల ఆవరణ లో సిరిసిల్ల మండల మహాసభ నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యతిధి గా జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,పెండింగ్ లో ఉన్న DA లను విడుదల చేయాలని, పిఆర్సీ ని వెంటనే ప్రకటించాలని,స్థానికత ఆధారంగా 317 బాధిత ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా టి ఎస్ యూ టి ఎఫ్ సిరిసిల్ల మండల కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికకు జిల్లా కోశాధికారి అంబటి రమేష్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.
కమిటీ వివరాలు
అధ్యక్షులు: వంగ మల్లేశం MPPS రాజీవ్ నగర్
ప్రధాన కార్యదర్శి: దాసరి చంద్రశేఖర్ MPPS బాబాజీ నగర్
ఉపాధ్యక్షుడు: బత్తిని అనిల్ కుమార్
ఉపాధ్యక్షురాలు: E. Vennela
కోశాధికారి: పల్లెవేని ఐలయ్య
కార్యదర్శులు:
జంగిటి భానుచందర్
గంగారాం
బైరి శ్రీనివాస్
రాములు
ఈ సందర్బంగాఅధ్యక్ష,, ప్రధానకార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >