Posted on 2025-11-23 18:26:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో ఆదివారం డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరం రోజురోజుకి తెలంగాణలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెంబర్ వన్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు ఏ చిన్న ఫర్నిచర్ అవసరం ఉన్న హైదరాబాద్, ఇతర మహా నగరాలకు వెళ్లి ఖరీదు చేసుకొని రావాల్సి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు భిన్నంగా నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని స్థాపించిన యాజమాన్యం సాయ రెడ్డి, స్వప్న అనే దంపతులు నిజామాబాద్ లాంటి నగరాల్లో అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన ఫర్నిచర్ షోరూమ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మాట్లాడుతూ నగరంలో ఆదివారం రోజు ఆరవ బ్రాంచ్ ను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ బడ్జెట్ తో నాణ్యమైన, మన్నికైన ఫర్నిచర్ అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. ఏ ఫర్నిచర్ షాపుల్లో లభించని విధంగా తమ షాపులో తక్కువ ధరకు అన్ని రకాల ఫర్నిచర్ లను కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు. తమ షోరూమ్ కు వచ్చి జిల్లా ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో జడ్పిటిసి ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >