Posted on 2025-11-29 13:52:48
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు రానున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు.వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడిదారులు, ప్రపంచస్థాయి ప్రముఖులకు మూడంచెల భద్రత కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. పాస్ లున్న వారికి మాత్రమే ఎంట్రీ తప్పా... ఇతరులకు అనుమతి ఉండదన్నారు .విదేశాల నుంచి 13 వందల మంది, జాతీయ స్థాయి ప్రముఖులు సమ్మిట్ కు హాజరవుతారని లక్ష్మారెడ్డి తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్ర అగ్రనాయకత్వం కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పెద్ద మనసుతో ఈ అంతర్జాతీయ వేడుకకు కాంగ్రెస్ సేనలు అందరూ సహకరించాలని ఆయన మనవి చేశారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >