| Daily భారత్
Logo




ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

News

Posted on 2025-12-03 18:49:20

Share: Share


ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి  : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా :  ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని యాదగరిగుట్ట మాదిరిగా తీర్చిదిద్దాలని నూతన ధర్మకర్తల మండలికి కేఎల్ఆర్ సూచించారు.దేవాలయ నూతన ఛైర్మన్ కోటగళ్ల రంజిత్ కుమార్ సహా కమిటీ సభ్యులతో దేవాదాయ, ధర్మాదాయ అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నూతన కమిటీ ఛైర్మన్ సహా సభ్యులు జమ్మల నారాయణరెడ్డి, సౌకుంట్ల సుప్రజా, పాశం రవీందర్, సొప్పారి దర్శన్, వేదపండితులు, ఆలయ ఈవోను ఘనంగా సన్మానించారు.ఆలయ ప్రతిష్ట పెంచి  భక్తులకు ఇబ్బందులు లేకుండా, అభివృద్ధి జరిగేలా చూడాలని ధర్మకర్తలకు కిచ్చెన్న సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని,మహేశ్వరం మహానగరంగా అభివృద్ధి చెందాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి... ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ఆయన వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గుడి నూతన కమిటీ సభ్యులు సహా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీలు, మార్కెట్, ఆలయ కమిటీలు, స్థానిక నాయకులు, వేదపండితులు, అధికారులు భక్తులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >