Posted on 2025-12-03 18:49:20
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని యాదగరిగుట్ట మాదిరిగా తీర్చిదిద్దాలని నూతన ధర్మకర్తల మండలికి కేఎల్ఆర్ సూచించారు.దేవాలయ నూతన ఛైర్మన్ కోటగళ్ల రంజిత్ కుమార్ సహా కమిటీ సభ్యులతో దేవాదాయ, ధర్మాదాయ అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నూతన కమిటీ ఛైర్మన్ సహా సభ్యులు జమ్మల నారాయణరెడ్డి, సౌకుంట్ల సుప్రజా, పాశం రవీందర్, సొప్పారి దర్శన్, వేదపండితులు, ఆలయ ఈవోను ఘనంగా సన్మానించారు.ఆలయ ప్రతిష్ట పెంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా, అభివృద్ధి జరిగేలా చూడాలని ధర్మకర్తలకు కిచ్చెన్న సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని,మహేశ్వరం మహానగరంగా అభివృద్ధి చెందాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి... ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ఆయన వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గుడి నూతన కమిటీ సభ్యులు సహా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీలు, మార్కెట్, ఆలయ కమిటీలు, స్థానిక నాయకులు, వేదపండితులు, అధికారులు భక్తులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >