Posted on 2025-12-04 20:28:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలోని శ్రీ దత్త నిర్మలాశ్రమంలో దత్త జయంతి వేడుకలు కన్నుల పండుగ గా గురువారం జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సాంబయ్య శాస్త్రి నిజామాబాద్ నగరంలో గత 37 సంవత్సరాలుగా దత్తాత్రేయుని మహిమలు దత్తాత్రేయుని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని సంవత్సరాల తరబడిగా ప్రజల్లో దత్తాత్రేయుని యొక్క లీలలను వివరిస్తూ దత్త ఉపాసకులుగా సాంబయ్య శాస్త్రి దత్తాత్రేని యొక్క మహిమలు లీలలను వర్ణిస్తూ ప్రజలలో దైవభక్తిని పెంపొందించడం గొప్ప విషయం అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు దత్త జయంతి సందర్భంగా నాగారం శివారు ప్రాంతంలోని శ్రీ దత్త నిర్మల ఆశ్రయముకు విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే డోలారోహణ ఇతర పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దత్త జయంతి రోజు ప్రతి ఏటా ఇక్కడ సహస్ర కలషాలను పెట్టి భక్తుల కోరిక మేరకు అవి నివృత్తి అవ్వడం కోసం ఆలయంలో పెట్టడం జరుగుతుందని కోరికలు తీర్చుకునేవారు కలశాలను ఇండ్లలోకి తీసుకువెళ్లి ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. నగర శివారులో ప్రశాంత వాతావరణంలో ఇలాంటి దత్త నిర్మలాశ్రమం ఆలయం ఏర్పడడం ఇందూరు ప్రజలు చేసుకున్న పుణ్యఫలం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం భక్తుల కొరకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >