Posted on 2025-12-05 12:21:15
తాత్కాలికంగానే ఛార్మినార్ జోన్ లోకి బడంగ్ పేట కార్పొరేషన్
పాలన సౌలభ్యం కోసం మాత్రమే పాత జోన్ల పరిధిలోకి
ప్రజల అభిష్టానం మేరకే ప్రజాపాలన కొనసాగుతుంది
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్ న్యూస్, రంగరెడ్డి జిల్లా : జిహెచ్ఎంసిలో విలీనం చేసిన శివారు మున్సిపాలిటీలకు కొత్త జోన్లు ఏర్పాటు చేసే వరకు పాత జోన్లల్లో కొనసాగిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బడంగ్ పేట కార్పొరేషన్ ను తాత్కాలికంగానే ఛార్మినార్ జోన్ లో విలీనం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
పాలన సౌలభ్యం కోసమే 27 పురపాలికలను అందుబాటులో ఉన్న సర్కిల్స్, జోన్ల పరిధిలోకి తెచ్చామని లక్ష్మారెడ్డి అన్నారు.
బడంగ్ పేట కార్పొరేషన్ సైతం మహేశ్వరం నియోజకవర్గంలో త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త జోన్ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు బడంగ్ పేట కార్పొరేషన్ విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. ప్రజల అభిష్టం మేరకు తప్పకుండా బడంగ్ పేట కార్పొరేషన్ ను ఛార్మినార్ జోన్ నుంచి మార్చుతామని... త్వరలో ఏర్పాటు కానున్న కొత్త జోన్ లోకి వస్తుందన్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ నాయకులకు జోన్లు, సర్కిల్స్, విలీన ప్రక్రియపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అందువల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >