Posted on 2025-12-07 08:40:10
డైలీ భారత్ న్యూస్, ఇంటర్నెట్ డెస్క్:పర్యాటక రాష్ట్రం గోవాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గోవాలోని ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో దాదాపు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అర్పోరా ( Arpora, Goa) ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 23 మంది మరణించగా అందులో నలుగురు పర్యాటకులు, మిగతా అందరూ క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయి, సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. అటు సంఘటన స్థలానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వచ్చి పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపతి మురుము కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే గోవా మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. గోవాలో అగ్ని ప్రమాదం బారిన పడి మరణించిన కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున PMNRF నిధుల నుంచి పరిహారం అందించనున్నట్లు పోస్ట్ పెట్టారు.
#goa #Arpora #beach
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >