Posted on 2025-12-21 20:23:54
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక ఆదర్శనగర్ లో గల నగర మేరు సంఘ భవనంలో మేరు కుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల కాల పరిమితి కొరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటుపడుతున్న అధ్యక్ష అభ్యర్థులు మాట్లాడుతూ నగరంలోని 10 తర్పల పరిధిలో సుమారు 11 వందల కుటుంబాలు ఉన్నాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుటుంబానికి రెండు ఓట్ల చొప్పున ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. మేరు కులస్తుల ఐక్యత, అభివృద్ధి కొరకు పాటుపడడమే తమ లక్ష్యంగా భావిస్తున్నామని కత్తెర గుర్తు అధ్యక్ష అభ్యర్థి కొట్టూరు దేవదాస్ చెప్పారు. అలాగే రాజకీయంగా విద్య ఉద్యోగ రంగాల్లో తమ కులస్తులు ముందుండేలా చూస్తామని తెలియజేశారు. విద్యార్థులకు వారిలోని ప్రతిభా పాటవాలకు గుర్తించి ప్రోత్సహిస్తామని, నిరుపేద మేరు కులస్తుల అంత్యక్రియలకు 2000 రూపాయలు ఆర్థిక సహాయం తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. అలాగే వివాహ యోగ్యులైన యువతీ యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక ను ఏర్పాటు చేస్తామని, నగరంలోని 10తర్పలలో భవనాల నిర్మాణానికి స్థల సేకరణ ఆర్థిక సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >