Posted on 2025-12-21 20:24:50
రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదంపై హర్షం
మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల న్యూ పెన్షనర్స్ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ ఉద్యోగుల, మేధావుల విద్యావంతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరై మాట్లాడుతూ బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల ఉద్యోగస్తులపై వివక్షత కొనసాగుతుందన్నారు. ఉన్నత వర్గాల వారు గ్రామాల్లోని సామాన్య ప్రజల విద్యకు, ఉద్యోగానికి, అధికారానికి దూరం చేస్తూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాచీన కాలంనాటి బానిస సాంస్కృతిని మనపై రుద్దే ప్రయత్నం మనువాదులు ముమ్మురం చేస్తూ దారిద్ర్యం లోకి నేడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీలు సంఘటిత మై చారిత్రక,సామాజిక సాంస్కృతిక,రాజకీయ వారసత్వాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటి పై ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె.రాజేందర్, అడ్వకేట్ రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్.నాగభూషణం, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్య వంశీధర్, డాక్టర్ చిలుక భాస్కర్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >