Posted on 2025-12-21 20:24:50
రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదంపై హర్షం
మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల న్యూ పెన్షనర్స్ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ ఉద్యోగుల, మేధావుల విద్యావంతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరై మాట్లాడుతూ బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల ఉద్యోగస్తులపై వివక్షత కొనసాగుతుందన్నారు. ఉన్నత వర్గాల వారు గ్రామాల్లోని సామాన్య ప్రజల విద్యకు, ఉద్యోగానికి, అధికారానికి దూరం చేస్తూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాచీన కాలంనాటి బానిస సాంస్కృతిని మనపై రుద్దే ప్రయత్నం మనువాదులు ముమ్మురం చేస్తూ దారిద్ర్యం లోకి నేడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీలు సంఘటిత మై చారిత్రక,సామాజిక సాంస్కృతిక,రాజకీయ వారసత్వాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటి పై ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె.రాజేందర్, అడ్వకేట్ రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్.నాగభూషణం, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్య వంశీధర్, డాక్టర్ చిలుక భాస్కర్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >