Posted on 2025-12-22 13:27:14
61 వాహనాలు స్వాధీనం..
అనుమానితులపై నిఘా!
డైలీ భారత్ న్యూస్, అన్నమయ్య జిల్లా/మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మదనపల్లె పట్టణంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సోమవారం వేకువజామున పోలీసులు "కార్డన్ అండ్ సెర్చ్" నిర్వహించారు. మదనపల్లె డిఎస్పీ ఎస్. మహేంద్ర పర్యవేక్షణలో పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
మదనపల్లె పట్టణ పరిధిలోని డక్నీ పేట, అగర్తలా వీధి, ఘోసియా వీధి, త్యాగరాయ వీధి మరియు బాడేమకాన్ ఏరియాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో 1వ పట్టణ సీఐ మహమ్మద్ రఫి, 2వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సరైన పత్రాలు లేని మరియు అనుమానాస్పదంగా ఉన్న 61 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాత నేరస్థులు, రౌడీ షీటర్లు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, వారిని క్షుణ్ణంగా విచారించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, "ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చేసేందుకే ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాము. ముఖ్యంగా యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా ఉంచుతాము. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలి. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి" అని కోరారు
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >