Posted on 2025-12-22 15:44:30
దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ట్రాఫిక్ సిఐ ఎస్ఐ పై నగరానికి చెందిన ఓ తాగుబోతు తన వాహనాన్ని ఆపారంటూ పోలీసులపై దాడికి దిగిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. వాహనాల తనిఖీలో భాగంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై పై దాడికి పాల్పడిన వ్యక్తిపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్ ప్రాంతానికి చెందిన పిట్ల సాయిలు అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసులపై విచక్షణారహితంగా దాడి జరిపారు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని చితకబాది సంబంధిత మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిట్ల సాయిలు పై కేసు నమోదు చేశారు. పోలీస్ విధులకు ఆటంకం కల్పిస్తూ, సిఐను తోసేసినట్లు కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. గత ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >