Posted on 2025-12-24 19:54:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో మంజూరైన 20 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రజలు ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, అయితే ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెక్కుల మంజూరులో ఏ పద్ధతి, ఏ నిష్పత్తి పాటిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిష్పత్తి ప్రకారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని సూచించారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >