Posted on 2026-01-08 14:20:25
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా కొంగరకలన్ ఐడిఓసి కార్యాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్,ఫ్యూచర్ సిటీ సీపీ గా నియమితులైన సుధీర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. షాద్ నగర్ నియోజక వర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో 50 శాతం కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఖాళీ ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్ళారు ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని కోరారు. షాద్ నగర్ నియోజక వర్గంలో ఉన్న 6 మండలాలు,2 మున్సిపాలిటీ లను ఒక డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా నియోజకవర్గం అంతా ఒక డివిజన్ గా ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కొత్తూరు,నందిగామ మండలాలు శంషాబాద్ డివిజన్ భాగంగా ఉండటం,మిగిలిన మండలాలు షాద్ నగర్ డివిజన్ ఉండటం మూలంగా పరిపాలన సౌకర్యవంతంగా లేకుండా గందరగోళంగా ఉండేదని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >