Posted on 2026-01-08 16:40:11
డైలీ భారత్, కరీంనగర్:జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలయ చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులతో సమీక్షించారు.
వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, షామియానాకు, క్యూ లైన్లు, బారికేడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని,ఆహార వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తుల రద్దీ దృష్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ట్రాఫిక్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్ తదితర విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి బారికేడ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. స్టేజి, లైటింగ్, సౌండ్, డెకరేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఆలయ చైర్మన్లు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో సుధాకర్ ఆలయ అర్చకులు నాగరాజు పాల్గొన్నారు.
#karimnagar
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >