Posted on 2026-01-20 05:28:25
ఐక్యమత్యంతో ఉండి పేద పెరిక కులస్తులను ఆర్థికంగా ఆదుకోండి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో పెరిక సంఘం ప్రారంభించినప్పటి నుండి తనకు ఎనలేని అనుబంధం ఉందని తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగేందుకు అదృష్టంగా భావిస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. సోమవారం నగరంలోని యేoడల టవర్స్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన పెరిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిక సంఘంతో తనకు మూడు తరాల తో నాకు సంబంధం ఉందని ఆయన అన్నారు. తన చిన్నప్పటినుండి ఇక్కడ పెరిక సంఘం ఒక చిన్న గదిలో సంఘo అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహించే వారని తన సిడిపి నిధులతో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భవనం అత్యంత సుందరంగా నిర్మించడం జరిగిందని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. నగరంలోని అన్ని కుల సంఘాల కంటే పెరిక సంఘం కుల భవనం ఎంతో గొప్పగా నిర్మించారని వారిని అభినందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఐక్యమత్యంతో ఉండి మీలో మీకు ఉన్న విభేదాలు వీడి అన్నదమ్ముల్లా ఉండి మీలో ఉన్న పేద కులస్తులను ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని వారిని కోరారు. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అది లోపిస్తే సంఘ అభివృద్ధి అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మీరు ఐక్యమత్యంతో ఉంటే రాజకీయ నాయకుల దగ్గరికి మీరు వెళ్లాల్సిన అక్కర్లేదని, తమలాంటి ఆయా రాజకీయ పార్టీ నేతలు మీ దగ్గరికి వచ్చి మీ బాగోగులు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఆయన తేల్చి చెప్పారు.
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >