Posted on 2026-01-20 05:29:34
ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన పలు డివిజన్ల కు చెందిన కాలనీవాసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి లక్ష్యంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చొరవ చూపిస్తూ డివిజన్ కు కోటి రూపాయల చొప్పున రోడ్లు డ్రైనేజీ ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి యు ఎఫ్ ఐ డి సి పథకం ద్వారా నగరంలోని 19 డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ 5 లో భూమి పూజ నిర్వహించినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా 20 డివిజన్ ఎల్లమ్మ గుట్ట, 36వ డివిజన్ నాందేవ్ వాడ, 34 వ డివిజన్ మిర్చి కాంపౌండ్, 49వ డివిజన్ శ్రీదేవి టాకీస్ రోడ్డు, 50 డివిజన్ పరిధిలోని గురుద్వార్ దగ్గర, 27వ డివిజన్ పరిధిలోని వర్ని చౌరస్తా ప్రాంతాల్లో, 8 వ డివిజన్ పరిధిలోని బంగారు మైసమ్మ గుడి సాయి నగర్ రోడ్ నెంబర్ 2, 3, 46వ డివిజన్ ప్రాంతాల్లో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నగర అభివృద్ధి లక్ష్యంగా తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లు, నాణ్యమైన డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ఈ ప్రత్యేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో అర్బన్ నియోజకవర్గాన్ని దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ డిఇ మరియు ఇంచార్జ్ మున్సిపల్ నగేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎఈ లు శివకృష్, శంకర్ పాల్గొన్నారు.
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >