Posted on 2026-01-20 05:31:37
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ వారాహి దేవి ఆలయం కు రాజా శ్యామల దేవి నవరాత్రుల శుభ సందర్భంగా కృష్ణశిల స్టోన్ రావడం వల్ల భక్తుల్లో ఆనందోత్సాహాలను కలిగించింది.
సోమవారం అత్యంత శుభకరమైన రోజున అనుకోకుండా కృష్ణశిల స్టోన్ ఆలయానికి చేరుకోవడం విశేషంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 120 టన్నుల కృష్ణశిల స్టోన్ ఆలయానికి చేరుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇది రెండో విడత కాగా, ఇంకా సుమారు 300 టన్నుల వరకు స్టోన్ రావాల్సి ఉందని తెలిపారు. ఈ కృష్ణశిల స్టోన్ రాకతో ఆలయానికి సంబంధించిన గర్భగుడి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రతి శుక్రవారం ఆలయ ప్రాంగణంలో తాత్కాలికంగా చిన్న గుడి ఏర్పాటు చేసి, అందులో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆలయం ప్రతిరోజూ భక్తుల దర్శనానికి తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అభిషేకం చేయించుకోవాలని కోరుకునే భక్తులు ఆలయంలోని అయ్యవారిని సంప్రదించాలని ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మహేష్ ఆచార్యులు, దీకొండ అశోక్, మంచాల జ్ఞానేందర్, సుదర్శన్, జయరాం సపతి, సంజీవ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ శ్రీ వారాహి దేవాలయం భవిష్యత్తులో ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >