Posted on 2026-01-20 08:57:18
డైలీ భారత్, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల (ప్రవేశాల) లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ రెహానా బేగం అధ్యక్షత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనారిటీ మత పెద్దలు జనాబ్ రహీమ్ మౌలానా, జనాబ్ నైమతుల్ల,జనాబ్ షేక్ అక్బర్ మౌలానా, జనాబ్ షేక్ మహమ్మద్ మౌలానా, జనాబ్ షేక్ మౌలానా షా తదితరులు హాజరై అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు.ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులు గురుకులాల్లోని విద్యా ప్రమాణాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.మైనారిటీ గురుకులంలో చేరడానికి కావలసిన దరఖాస్తు ప్రక్రియను మరియు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య నాణ్యమైన వసతుల గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >
జూలూరుపాడు మండలంలో యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 18:43:54
Readmore >
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >