Posted on 2026-01-20 10:32:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి గ్రామం వెంకటాపురం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, 6 లేగ ఆవు దూడలను అక్రమంగా రవాణా చేస్తూ కబేళాలకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అన్నపురెడ్డిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుండి అశోక్ లేలాండ్ మినీ ట్రక్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు అన్నపురెడ్డిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతుల వద్ద నుండి లేగ ఆవు దూడలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు సంత ద్వారా హైదరాబాద్లోని కబేళాలకు సంబంధించిన వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించేందుకు అశోక్ లేలాండ్ మినీ ట్రక్లో అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో, వెంకటాపురం క్రాస్ రోడ్ వద్ద వాహనాన్ని అడ్డగించి, ఇద్దరు వ్యక్తులను మరియు వాహనాన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఆక్రమ పశువుల రవాణానికి చేస్తున్నట్లయితే నేరుగా అన్నపురెడ్డిపల్లి పోలీస్ వారికి లేదా హండ్రెడ్ కి డైల్ కాల్ చేయండి అని అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >