Posted on 2026-01-20 19:15:24
పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి మాత ఆలయంలో మంగళవారం రోజున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి వేద పండితుల ఆధ్వర్యంలో 102 గోత్రాలతో కూడిన కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమాలను గత వారం రోజుల నుండి ఈ ఆత్మార్పణ కార్యక్రమానికి కృషి చేస్తున్న కమిటీ పనిచేస్తుందని అధ్యక్షులు తెలిపారు. అమ్మవారి విశేష పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వాసవి మాత ఆత్మార్పణ ఉత్సవాలకు ఆలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తాను కూడా కట్టుబడి పని చేస్తానన్నారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.వాసవి మాత అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం కార్యక్రమాలు విశేష భక్తుల ఆధ్వర్యంలో పండితులు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులు మహిళలు భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆలయ కమిటీకుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ముగించి మంగళవారం రోజున రాత్రి వరకు ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా కార్యదర్శి కూర శ్రీనివాస్, విశ్వనాథులరాజేందర్,ఉపాధ్యక్షులు సునీల్ కుబీ,యాదా అంజయ్య,గరిపల్లి శ్రీధర్ బంకటేష్ శీనన్న, మొగిలిపల్లి రమేష్ గుప్తా, మోత్కూరు శ్రీనివాస్,వెంకటేష్, నీల రాజు, కాసర్ల నరహరి,ఆలయ అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మర్పణ కార్యక్రమం ని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >