Posted on 2026-01-21 18:19:25
డైలీ భారత్, హుజూర్ నగర్:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాస పురం గ్రామంలో మంగళవారం వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో ఒక లేగ దూడ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది.
ఈ ఘటన గ్రామంలో వీధి కుక్కల సంఖ్య నియంత్రణలో లేకపోవడం, పంచాయతీ మరియు పశుసంవర్ధక శాఖల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు వీధి కుక్కల సమస్యపై ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం వల్లే ఈ నిరపరాధ జీవి ప్రాణాలు కోల్పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
అందువల్ల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వీధి కుక్కల నియంత్రణకు సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ఘటనను తేలికగా తీసుకుంటే ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >