Posted on 2026-01-21 22:40:27
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం తుక్కుగూడ కార్యాలయంలో కందుకూరు మండల నాయకులు, సర్పంచులు, కో- ఆర్డినేటర్స్ తో ప్రత్యేకంగా ఆయన సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు మండలంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందని సర్వే నివేదికలు చెబుతున్నాయని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలోనూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
సీనియర్ నాయకులు, సర్పంచులు, కొత్తగా పార్టీలో చేరిన నాయకుల మధ్య సమన్వయ లోపం ఉండొద్దని కేఎల్ఆర్ సూచించారు.బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా జనాలను మభ్యపెట్టి, మాయ మాటలతో ఓట్లు కొల్లగొడుతున్నారని... మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని యువకులకు సూచించారు.
ప్రతీ ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు పేద, మధ్య తరగతికి అందాయని ఆయన గుర్తు చేశారు. విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >