Posted on 2026-01-23 11:23:01
డైలీ భారత్, కామారెడ్డి:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026ను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మరియు దోమకొండ మండలాల్లోని పలు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ZPHS ఉప్పల్వాయి, ZPHS పోస్సాయణపేట, ZPHS రామారెడ్డి, సోషల్ వెల్ఫేర్ పాఠశాల దోమకొండ మరియు జూనియర్ కళాశాల దోమకొండలో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు శ్రవణ్, ఇర్షాద్, శంకర్, రఫీ మరియు స్నిగ్ధ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. పాదచారులుగా నడిచే సమయంలో, బస్సులు మరియు ఇతర వాహనాల్లో ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు సరళమైన భాషలో వివరించారు. అలాగే ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే బాధ్యతాయుతమైన అలవాటు అలవర్చుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసే గుడ్ సమారిటన్లకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టపరమైన రక్షణలు మరియు ప్రోత్సాహకాల గురించి కూడా విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. చిన్న వయసులోనే రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >