Posted on 2026-01-23 11:25:30
డైలీ భారత్, కామారెడ్డి:విద్యార్థి నాయకుడు ప్రత్యేక మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు వడ్ల సాయి కృష్ణ ను గురువారం ఆధార్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో ఆధార్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఈడా. శేషగిరిరావు గౌడ్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆధార్ పార్టీ లోకి కండువా కప్పి వడ్ల సాయి కృష్ణ ను ఆధార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
ఆధార్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా వడ్ల సాయికృష్ణ నియమిస్తున్నట్లు నియామక పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆధార్ పార్టీ అధ్యక్షులు డాక్టర్. ఈడా శేషగిరిరావు గౌడ్ మాట్లాడుతూ" వడ్ల సాయి కృష్ణ విద్యార్థి, ప్రజా ,కార్మిక ,బీసీ రిజర్వేషన్ అంశాలపై ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన ఆశయం గొప్పది అలాగే ఇలాంటి యువనాయకత్వం రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం దిశగా ప్రజలను ఏకం చేసి ఆధార పార్టీ లక్ష్యానికి అనుగుణంగా " మనమేంతో మనకంత- అందరికీ సమాన రాజ్యాధికారం- తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి" అనే నినాదంతో వెళ్తున్న ఆధార్ పార్టీ ని (చపాతీ రోలర్ ) భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించబడ్డ అధికారిక గుర్తు.కామారెడ్డి జిల్లాలో వడ్ల సాయి కృష్ణ ముందుకు తీసుకెళ్తాడని పేర్కొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >