Posted on 2026-01-23 15:45:49
రూరల్ పోలీస్ స్టేషన్, మాక్లూరు పోలీస్ స్టేషన్ల ప్రారంభించిన డిజిపి శివధర్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఐజి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వాగతం పలికారు. కంటేశ్వర్ ప్రాంతంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డిజిపి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి , సిపి సాయి చైతన్య ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >