Posted on 2026-01-23 17:01:41
నిజామాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది
ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. ముఖ్యంగా 58వ డివిజన్ పరిధిలోని జామా మసీద్ ప్రాంతంలో సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణంలోని పలు డివిజన్ లలో రెండున్నర కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగర రూపురేఖలను మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని పేర్కొన్నారు. 45 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులను నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ధనం ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూస్తామన్నారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మరియు పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. నిజామాబాద్ ప్రజల అవసరాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు మరియు మున్సిపల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >