Posted on 2026-01-24 17:00:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డిలోని సమీకృత కార్యాలయాల భవనంలో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. కలెక్టరేట్లోని సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరిగా కలెక్టరేట్ మొత్తం కలియ తిరిగినట్టుగా తెలుస్తోంది. అనంతరం గంట తర్వాత సివిల్ సప్లయ్స్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది ఫోన్లు తీసుకుని సోదాలు ప్రారంభించినట్టుగా సమాచారం. కార్యాలయ సిబ్బంది ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తారు అనే వివరాలు తీసుకుని కార్యాలయంలోని రికార్డులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆకస్మికంగా ఏసీబీ సోదాలు జరగడం కలకలం రేపింది. ఈ తనిఖీల్లో భాగంగానే సోదాలు సర్వసాధారణంగా చేపడుతున్నారా..? లేక ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేశారా... అనే విషయం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >