Posted on 2026-01-25 15:09:37
కాంగ్రెస్, బిజెపి పాలనలో మత విద్వేషాలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం దారుణం
నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా తయారవుతుందని, కాంగ్రెస్ బిజెపి పాలనలో మత విద్వేషాలు, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం తనకు ఎంతో ఆవేదనకు గురిచేసిందని నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అధికార కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చామన్నారు. ఇపుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో నిజామాబాద్ నగరంలో కానీ వినీ ఎరుగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. నగర అభివృద్ధికోసం 100 కోట్లు నిధులు 2022 సంవత్సరంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో 60 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడితే బీజేపీ ఎమ్మెలే క్లెయిమ్ చేసుకోవటం సిగ్గుచేటు అని దుమ్మెత్తి పోశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగర అభివృద్ధికోసం కేవలం 10 కోట్లు కేటాయించారన్నారు . రాజకీయ వ్యవస్థ సరిగాలేకపోవటం వల్ల శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై నిత్య పోరాటం చేస్తామన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరవేసే వ్యూహాలు సిద్ధం చేసుకున్నామన్నారు. ఇకప్రజా నిర్ణయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >