Posted on 2026-02-04 20:15:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ సుజాతనగర్ మండలం కార్పొరేషన్ పరిధిలోని నాలుగు డివిజన్ లో కార్పొరేషన్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు సుజాతనగర్ పోలీసు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సదస్సులో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ . రాయలవెంకటేశ్వర్లు, , సుజాతనగర్ తాసిల్దార్, సుజాతనగర్ ఎస్సై ఏం.రమాదేవి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచనలు తెలియజేయడం జరిగింది ఎన్నికల ప్రచారం కొరకు వాహనాలను మరియు మైకుల కు కచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మరియు డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి. పబ్లిక్ మీటింగ్లు ర్యాలీలు తీయడానికి పర్మిషన్ తీసుకోవాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన, కుటుంబాన్ని ఉద్దేశించి, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, పోస్టులు పెట్టే వారిపై, గ్రూపు అడ్మిన్ పై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ రోజుకి 48 గంటల ముందు ప్రచారం ఆపివేయాలి. 50 వేలకు మించి డబ్బు కలిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు కలిగి ఉండాలి లేనిచో అట్టి డబ్బులు సీజ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ కు వంద మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారం గానీ, పార్టీ గుర్తులు గాని చూపించరాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలని పాటించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ సిబ్బంది సుజాతనగర్ మండల ప్రజలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >