Posted on 2026-02-24 15:11:29
షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం బాటిల్ ప్రత్యక్షం
కొబ్బరి బోండాలకు అనుమతులు లేవు కానీ కోటర్ సీసాలకు ?
నిబంధనలు కేవలం బోర్డులకేనా?
ప్రమాదకరంగా మారిన బయో మెడికల్ వేస్ట్
ఆసుపత్రిలో పలుచోట్ల దర్శనమిస్తున్న ఇంజక్షన్లు మెడికల్ వేస్టేజ్
డైలీ భారత్, షాద్నగర్, రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రాణదానం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి, అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగాలకు నిలయంగా మారుతోంది. షాద్నగర్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో పారిశుధ్యం పడకేసింది. నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న అధికారులు, ఆసుపత్రి లోపల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను మాత్రం గాలికొదిలేశారు.
నిబంధనలు కేవలం బోర్డులకేనా?
ఆసుపత్రి లోపలికి కొబ్బరిబోండాలను తీసుకురాకూడదని పెద్ద పెద్ద బోర్డులు పెట్టిన యాజమాన్యం, అదే ఆసుపత్రి రెండో అంతస్తులో దర్శనమిస్తున్న మద్యం సీసాలను ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోగులు కోలుకోవడానికి తాగే కొబ్బరినీళ్లపై ఉన్న నియమం, మందు బాటిళ్లపై లేదా? అని పౌరులు మండిపడుతున్నారు.
ప్రమాదకరంగా మారిన బయో మెడికల్ వేస్ట్
ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వాడిన ఇంజక్షన్ సూదులు, సిరంజీలు, మెడికల్ క్రీములు కుప్పలుగా పడి ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని సురక్షితంగా ధ్వంసం చేయాలి, కానీ ఇక్కడ మాత్రం బహిరంగంగా పడేయడం వల్ల చిన్నారులకు, రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంది. స్వచ్ఛ భారత్ నినాదం ఈ ఆసుపత్రి గడప కూడా దాటలేదని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
బాధ్యులపై వేటు పడాల్సిందే!
ఆసుపత్రిలో మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? పారిశుధ్యం నిర్వహించాల్సిన వారు నిద్రిస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలివరణలో ఎక్కడ చూసినా వాడిన ఇంజక్షన్ సూదులు, సిరంజీలు, మెడికల్ క్రీములు కుప్పలుగా పడి ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని సురక్షితంగా ధ్వంసం చేయాలి, కానీ ఇక్కడ మాత్రం బహిరంగంగా పడేయడం వల్ల చిన్నారులకు, రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంది. స్వచ్ఛ భారత్ నినాదం ఈ ఆసుపత్రి గడప కూడా దాటలేదని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.
బాధ్యులపై వేటు పడాల్సిందే!
ఆసుపత్రిలో మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? సెక్యూరిటీ సిబ్బంది ఏం ? పారిశుధ్యం నిర్వహించాల్సిన వారు నిద్రిస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >