Posted on 2026-03-07 21:29:26
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ప్రజలందరి ఆరోగ్య దృష్టిని కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం అందరికీ ఓ వరం లాంటిది. అరుదైన ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని, మీ కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘ కమిటీ సభ్యులు కోరారు. హైదరాబాద్ లోని శంకర్ శంకర్ కంటి ఆస్పత్రి సౌజన్యంతొ 8వ తేదిన ఆదివారం చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంలోని రైతు బజార్ పోచమ్మ తల్లి గుడి వద్ద ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని కొత్తగూడెం పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా గతంలో విడతల వారీగా ఏర్పాటు శిబిరాల్లో వేలాది మంది కంటి పరీక్షలు చేసుకోగా ఇప్పటి వరకు 600 మందికి పైగా వ్యక్తులకు కంటి ఆపరేషన్ లు చేయించినట్టు వారు వివరించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతు నిరుపేదలకు ఇలాంటి క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం అందించడం తమ బాధ్యత అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవ సంఘం రేఖ రాజశేఖర్, గునిగంటి చందర్, నమ్మి జగదీష్, పెద్దిరెడ్డి సుంకు కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >