| Daily భారత్
Logo




మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

News

Posted on 2026-03-08 08:40:36

Share: Share


మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

లోక్ అదాలత్ కోసం అధికారులతో జాతీయ లోక్ అదాలత్ సన్నాహాక సమావేశం

షాద్ నగర్ ఎసిపి లక్ష్మీనారాయణ, నియోజకవర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్ల సిఐల హాజరు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మార్చి 28న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కోర్టు సముదాయంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని బాధ్యత విధంగా నిర్వహించాలని 16వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో జిల్లా అదనపు జడ్జ్ ఎస్ స్వాతి రెడ్డి తో పాటు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కొత్త రవి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం సాహితీ, షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, నందిగామ సిఐ ప్రసాద్, కొత్తూరు సిఐ నరసయ్య, కేశంపేట నరహరి, చౌదరి గూడ ఎస్సై విజయ్ కుమార్, కొందుర్గు ఎస్సై వెంకటేష్ అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబియా సుల్తాన తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్ స్వాతి రెడ్డి పోలీసులు బ్యాంకు అధికారులతో మాట్లాడారు. ఘర్షణలు వ్యక్తిగత దూషణలు బ్యాంకులకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులు తదితర కేసులకు సంబంధించి పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంత ఉపయోగపడుతుందని ఈ అదాలత్ ద్వారా కక్షిదారులను రాజీపరిచి కేసులను తీసి వేసుకునేందుకు మంచి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ స్థాయిలో కేసులను రాజీపరచుకునే విధంగా పోలీసు శాఖ అదేవిధంగా బ్యాంకుల యాజమాన్యం కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల షాద్ నగర్ పట్టణ సిఐగా బాధ్యతలు చేపట్టిన సీతారాం జిల్లా అదనపు జడ్జి ఎస్ స్వాతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆమెకు పూల మొక్కను బహుకరించారు..

Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >