Posted on 2026-03-08 11:57:45
డైలీ భారత్, సిరిసిల్ల: పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం వచ్చే మార్చి 18 న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం లో నిర్వహించ నున్నట్లు మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్, గెంట్యాల భూమేశ్, ఆడెపు లక్మన్ ఒక ప్రకటనలో తెలిపారు..
సంప్రదాయాన్ని అనుసరించి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించేందుకు మానేరు రచయితల సంఘం సంకల్పించింది. ఇందుకోసం ఆసక్తి గల కవి, రచయితల నుంచి ఉగాది కవితలను ఆహ్వానిస్తున్నాం.
ఔత్సాహికులు ఎవరైనా కవితా గానం చేయొచ్చునన్నారు . గానం చేసే కవితలు ముందుగానే తెలియజేయాలి.
పండుగ నేపథ్యం, ప్రాశస్త్యం, జన జీవనం పై ఋతువులో మార్పుల ప్రభావం, రాబోయే కాలంలో సాంఘిక జీవనం ఎలా ఉండాలని ఆశిస్తూ.. పండుగ, ప్రజల్లో కొత్త మార్పులకు చోటు కల్పించాలనే ఆకాంక్షతో ఉండాలి.
మూస ధోరణికి భిన్నంగా ఉండాలి.
ఎంపిక చేసిన కవితలను మాత్రమే గానం చేయాలి.
కవులు తమ కవితలను మార్చి 15 లోపు
98491 57752
నెంబర్ కు వాట్సప్ లో పంపించాలి.
గతం లో గానం చేసినవి, పత్రికల్లో అచ్చయినవి కాకుండా నూతనంగా, నవ్యత్వం ఉట్టి పడేలా కవితల రచనలుండాలి.
పాల్గొన్న ప్రతి కవికీ సంఘం పక్షాన సత్కారం ఉంటుంది. గడువు తరువాత అందిన కవితలు పరిశీలించ బడవు అని గెంట్యాల భూమేశ్, డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ ఆడెపు లక్మన్అధ్యక్ష, కార్యదర్శులు మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల తెలిపారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >