Posted on 2026-03-08 18:51:10
డైలీ భారత్, దమ్మన్నపేట్: అగస్థ్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు కాగ్నిజెంట్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన “ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్” రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ZPHS దమ్మన్నపేట్ 8వ తరగతి విద్యార్థులు పొన్నాల లోహిత, కోల లాస్య ప్రియ లు, అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు.
ఈ కార్యక్రమం మార్చి 6, 7 తేదీలలో సికింద్రాబాద్లోని తెలంగాణ గార్డెన్ హాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా 272 మంది విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శన కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి అత్యుత్తమ 65 ఆవిష్కరణలను ఎంపిక చేసి వారికి తుది పోటీని నిర్వహించారు.
ఈ పోటీలలో గైడ్ టీచర్ సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో పొన్నాల లోహిత, కోల లాస్యప్రియ విద్యార్థినులు రూపొందించిన “వంటమిత్ర” అనే వినూత్న ఆవిష్కరణతో అద్భుతమైన ప్రదర్శన చేసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలకు 10 వేల నగదు తో పాటుగా, జ్ఞాపిక ము అగస్థ్య ఫౌండేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బలరాం, మరియు నటేష్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >