Posted on 2026-03-11 15:58:37
డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రకృతి గర్భగుడి
మన హృదయం ప్రకృతి గర్భగుడిగా మారిన వేళ,
వర్షపు చినుకులు అభిషేకాలై జలజలా కురిశాయి.
గాలుల సున్నిత నాదం మంత్రోచ్ఛారణై పలికిన వేళ,
పక్షుల గానధారలు ఘంటానాదాలై మార్మోగాయి.
భూమి ఒడిలో మొలిచిన ప్రతి పచ్చ మొగ్గ,
దైవసాన్నిధ్యపు మౌన ప్రతిమగా నిలిచింది.
సూర్యకిరణాలు హారతులై వెలుగులు చిందించగా,
చంద్రకాంతి కరుణా ప్రసాదంలా జాలువారింది.
కానీ —
మనిషి మనసులో మొలిచిన స్వార్థపు ముళ్లు
ఆ ప్రకృతి గర్భగుడిని గాయపరిచాయి.
అసూయ అనే అగ్నికణం ఎగసి పడిన వేళ
హృదయ పవిత్రత బూడిదగా మారింది.
అహంకారం అనే అంధకారం కమ్ముకున్నప్పుడు
ఆత్మదీపం మసకబారింది.
ద్వేషం అనే విషగాలి వీచిన క్షణంలో
జీవన వనమే వాడిపోయింది.
అడవులను నరికిన కత్తుల ధ్వని
మనిషి ఊపిరినే మూలం నుంచి కోసేసింది.
పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ
ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.
మన హృదయం మళ్లీ పవిత్రమైతేనే
ప్రకృతి గర్భగుడి తిరిగి వెలుగుతుంది.
మన ప్రేమే హారతి, మన కరుణే పూజగా మారితే
ఈ భూమి మళ్లీ దైవాలయంగా వికసిస్తుంది.
పకృతిని కాపాడాలని కోరుకుంటూ...
మ
మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >