Posted on 2026-03-11 14:49:53
బాధితురాలికి అండగా నిలిచిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నరసింహసాగర్ కు చెందిన దంసలపూడి పద్మ అనే మహిళను తన కొడుకు నాగరాజు ఆస్తి కోసం కొడుతూ తిడుతూ ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బందులు తట్టుకోలేక ఆ మహిళ దిశ ప్రొటెక్షన్ టౌన్ అధ్యక్షురాలు అరుణ ను ఆశ్రయించింది. దిశ ప్రొటెక్షన్ ఫౌండేషన్ చైర్మన్ బీవీ రాజు, ఉపాధ్యక్షులు కళ్యాణి, జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ, జిల్లా జనరల్ సెక్రెటరీ పిట్టల కమలమ్మ సూచనతో టౌన్ అధ్యక్షురాలు బొల్లం అరుణ ఆధ్వర్యంలో బాధిత మహిళ దంసలపూడి పద్మతో మాట్లాడిన సభ్యులు ఆమె సమస్యను తెలుసుకుని సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రమాదేవి ని కలిసి పద్మ న్యాయం జరిగేలా చూడాలని మాట్లాడి బాధితురాలు కొడుకుపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మండల ప్రెసిడెంట్ దేవరపల్లి రజిని, జగన్నాధపురం మండల ప్రెసిడెంట్ గడ్డం జ్యోతి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మందకృష్ణ వేణి, దిశా సభ్యురాలు బిందు పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >