| Daily భారత్
Logo




తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి

News

Posted on 2026-03-14 22:05:48

Share: Share


తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి

డైలీ భారత్, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లో  తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఈ రోజు జరిగింది తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త మరియు కవయిత్రి  మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ

తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు రాం ప్రసాద్ రావు కి, స్టేజీపై ఉన్న పెద్దలందరికీ,

ఈ సభకు విచ్చేసిన సంఘ సభ్యులందరికీ,

మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు

పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ 

నా పేరు మంజుల పత్తిపాటి.

నేను గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేశాను, ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి — నేను ఒక కరణం ముద్దుబిడ్డను అని చెప్పుకోవడం నాకు గర్వకారణం, 

ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం సాధారణ సమావేశం కాదు.

ఇది మన చరిత్రను గుర్తు చేసే సమావేశం అని అన్నారు. 

ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగులు వెలిగించిన చేతులు మనవి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది.

కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి?

గ్రామాల్లో మనకు ఉన్న పరపతి తగ్గిపోయింది.

కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కొంటున్నాం అని అన్నారు. 

ఒకప్పుడు పులిలా జీవించిన మనం,

ఇప్పుడు పిల్లిలా బ్రతుకుతున్న పరిస్థితి వచ్చింది.

దానికి ప్రధాన కారణం ఏమిటంటే 

మన మధ్య ఐక్యత లేకపోవడం.

మనలో చాలా మందిలో ఒక భావన పెరిగింది —

“నేను లాభపడకపోయినా పర్వాలేదు,

నా పక్కవాడు లాభపడకూడదు” అనే భావన.

ఈ భావనతో మన సమాజం ముందుకు వెళ్లదు.

ఒకరి బాధ అందరి బాధ కావాలి.

ఒకరి విజయం అందరి విజయం కావాలి.

అప్పుడే మన సమాజం బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. 

ఈ సమావేశం కేవలం మన కోసం కాదు.మన తర్వాతి తరం మనలాగే కష్టాలు పడకూడదనే సంకల్పంతో జరుగుతున్న సమావేశం అని నేను భావిస్తున్నాను. మనము విడిపోయితే మన చరిత్ర మసకబారుతుంది. మనము కలిస్తే మన చరిత్ర మళ్లీ ప్రకాశిస్తుంది. 

ఒక మహిళగా నేను చెప్పేది ఒక్కటే 

ఇంటిని నిలబెట్టేది మహిళ అయితే,

మన సమాజాన్ని నిలబెట్టేది ఐక్యత.

అందుకే మన చేతులు మళ్లీ కలవాలి.

మన స్వరం మళ్లీ గర్జించాలి అని పిలుపునిచ్చారు. 

మన మధ్య దూరం పెరుగుతుందని, మన గౌరవం మెల్లగా తగ్గిపోతుందని గ్రహించిన మన అందరి ప్రియమైన బంధువు బండారు రాం ప్రసాద్ రావు అన్న, ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం.

వారి కృషి వల్లనే ఈ రోజు మనం అందరం ఒకే వేదికపై కలిసే అవకాశం వచ్చింది. అందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను అని జై హిందూ! జై తెలంగాణ! అంటూ ముగించారు 

ఈ  కార్యక్రమంలో  చకిలం అనిల్ కుమార్ చందుపట్ల వెంకటేశ్వర రావు కరణం నాయకులు అందరూ పాల్గొన్నారు

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >