Posted on 2026-03-16 17:04:46
డైలీ భారత్, మణుగూరు: మణుగూరు మండలం పగడేరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూలిపోయిన వంతెనను పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ప్రజాదర్భ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, తమ గ్రామంలో సుమారు 80 గిరిజన కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా నివసిస్తూ పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పలగుంపు గ్రామం నుంచి పగడేరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తమకు ఏకైక రవాణా మార్గమని చెప్పారు. ఈ మార్గం ద్వారానే పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం జరుగుతుందని, అలాగే గ్రామస్తులు నిత్యావసర వస్తువుల కొనుగోలు మరియు అత్యవసర వైద్య సేవల కోసం ఇదే రహదారిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై ఉన్న వంతెన తీవ్రంగా దెబ్బతిని కుంగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ వంతెన రోజురోజుకు మరింత కూలిపోతూ ప్రమాదకరంగా మారిందని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో వంతెన పూర్తిగా కూలిపోయే అవకాశం ఉండడంతో గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల సంబంధిత అధికారులు స్పందించి ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెనను అత్యవసరంగా పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >