Posted on 2026-03-21 12:50:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ నుండి మణుగూరు కొల్లాపూర్ ట్రైన్ రద్దు అయ్యి ఇప్పటికే సంవత్సరం దాటింది. ఈ ట్రైన్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జిల్లాల ప్రజలకు చాలా అవసరమైన రైలు.
కర్ణాటక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఈ రైలు పునరుద్ధరణ కోసం అధికారులకు లేఖలు రాసి, ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. ఇది నిజంగా ప్రజల ప్రయోజనం కోసం చేసే మంచి ప్రయత్నం. తెలంగాణలో ఈ ముఖ్యమైన ట్రైన్ గురించి ఇంకా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ రైలు సికింద్రాబాద్ నుండి భువనగిరి, వరంగల్, మహబూబాద్ మార్గంగా వెళ్లి మణుగూరువరకు వెళ్తుంది. ఈ మార్గంలో వేలాది మంది ప్రయాణికులు ఈ సేవ కోసం ఎదురుచూస్తున్నారు.
అందువల్ల సంబంధిత ప్రజాప్రతినిధులు భువనగిరి ఎంపీ ,వరంగల్ ఎంపీ, మహబూబాద్ ఎంపీ విషయాన్ని రైల్వే మినిస్టర్ మరియు రైల్వే బోర్డ్ దృష్టికి తీసుకెళ్లి కొల్లాపూర్ మణుగూరు ట్రైన్ సర్వీస్ ను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నాము.
ఈ రైలు పునఃప్రారంభం అయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >