Posted on 2026-04-05 13:28:22
పాడి పంట రైతుల ఆవేదన
జెసిబి సహాయంతో మట్టి తరలింపు
ఎదురు మాట్లాడితే బెదిరింపులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో వాగులో ఉన్న అన్ని రేవుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా జెసిబిలతో వాగులోని ఇసుక, మట్టిని భారీగా తవ్వుతూ అక్రమ దందా గా వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతోంది. వాగు సహజ స్వరూపం పూర్తిగా దెబ్బతిని భూగర్భ జలాలు తగ్గిపోతుండగా వర్షాకాలంలో వరదల సమయంలో తీరం కూలిపోవడం వల్ల వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది. వాగు మట్టిని విచక్షణారహితంగా తొలగించడం వల్ల నేల బలహీనమై రైతుల పొలాలు నష్టపోతున్నాయి. బావులు, బోర్లు ఎండిపోవడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ట్రాక్టర్ యజమానులు సిండికేట్గా ఏర్పడి లక్షల్లో అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ ఎదురు మాట్లాడిన రైతులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. తెల్లవారుజామున ట్రాక్టర్ల రాకపోకలతో శబ్ద కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలకు నిద్ర లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి, రోడ్లు దెబ్బతింటూ దుమ్ము కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ట్రాక్టర్ శబ్దాల కారణంగా పాడి పంటలు పశువులు దెబ్బతింటున్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాగులో ప్రమాదకర గుంతలు ఏర్పడి పశువులు పడి మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు, గతంలో ఇదే వాగులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ తవ్వకాలు ఆగకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మరియు సుజాత నగర్ మండల అధికారులు మొద్దు నిద్ర విడనాడి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుని వాగును, రైతుల జీవనోపాధిని రక్షించాలని సుజాతనగర్ మండల గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >