Posted on 2026-04-05 16:26:11
దేశాభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయం: అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి: భారతదేశ మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఆదివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో బాబు జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర విశిష్టమైందని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం వివిధ కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ దేశాభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం పోరాడారని వివరించారు.
సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ కి ఘన నివాళులు అర్పించారు.
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >