Posted on 2026-04-06 13:55:21
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం స్థానిక గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లీలా కృష్ణ డాక్టర్ మురళీకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
అనంతరం వక్తలు మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్థానికంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తూ పూర్తిస్థాయి మౌలిక వసతులతో నూతన ఆవిష్కరణలతో విద్యాసంస్థ నిర్వహిస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీ పరీక్షలలో స్థానిక విద్యార్థులు ప్రపంచీకరణలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టామని ప్రధానోపాధ్యాయులు చిలుక వేణు కిరణ్ తెలిపారు.
ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >