Posted on 2026-04-18 14:46:08
డైలీ భారత్, ఆగ్రా: ఓ మహిళ ప్రియుడిని చాలా కూల్ గా చంపేసి, అంతకంటే కూల్ గా హోటల్ రిసెప్షన్ దగ్గరకొచ్చి, పోలీస్ కు ఫోన్ చేసింది. నా లవర్ ని చంపేశాను.. సుత్తితో తలమీద కొట్టి, కత్తితో గొంతు కోసి చంపేశా.. హోటల్లోనే ఉంటాను, రండి అని నిదానంగా చెప్పింది. ఆ మహిళ కూల్ యాటిట్యూడ్ చూసి హోటల్ సిబ్బంది వణికిపోయారు. పోలీస్ వచ్చాక వాళ్లతో వ్యాన్ ఎక్కి స్టేషన్ కు వెళ్లింది. ఆగ్రాలో నిన్ననే జరిగిందీ ఘోరం. 29 ఏళ్ల వివాహిత, తన 36 ఏళ్ల ప్రియుడితో 11 గంటలకు హోటల్ కు వచ్చింది. గంటలో ఏమైందో ఏమో కిందకొచ్చి తన లవర్ ను చంపేశానని చెప్పింది. ఇద్దరూ దూరపు బంధువులే. ఆమెకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవల కాలంలో ప్రియుడు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అందుకే చంపేశానని చెప్పింది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అత్యంత కిరాతకమైన హత్య ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక వివాహిత తన ప్రియుడిని దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వివాహిత మరియు ఆమె ప్రియుడు కలిసి ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారి మధ్య ఏదో విషయంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ, తన వెంట తెచ్చుకున్న సుత్తితో అతడి తలపై బలంగా బాదింది. దీంతో అతను స్పృహ కోల్పోగా, అంతటితో ఆగకుండా వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి కిరాతకంగా చంపేసింది.
హత్య జరిగిన వెంటనే సదరు మహిళ పారిపోకుండా, తానే ఈ హత్య చేశానని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలు హత్యకు గల బలమైన కారణం ఏమిటనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వివాహేతర సంబంధం వికటించడమే ఈ హత్యకు ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >