Posted on 2026-04-23 18:23:44
జూన్ 12న పునఃప్రారంభం
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవిసెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 24 నుంచి అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సర కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. విద్యా సంవత్సరం చివరి రోజులోగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటలు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని తెలిపింది. పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలని, తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదేశించింది.
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >