| Daily భారత్
Logo




జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

News

Posted on 2026-05-08 20:00:11

Share: Share


జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు ఆహ్వానం..

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లందరికీ ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐ. ప్రభాకర్ తెలిపారు. ఇటీవల ఘనంగా నిర్వహించిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మీడియా వర్గాల నుంచి విశేష స్పందన లభించింది ప్రెస్ క్లబ్‌ను జర్నలిస్టుల హక్కులు, ఐక్యత, సంక్షేమానికి అంకితమైన వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రారంభ దశలో 10 మంది సభ్యులతో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పుడు పూర్తి స్థాయి కమిటీ పునర్వ్యవస్థీకరణ కోసం జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి మీడియా ప్రతినిధి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రెస్ క్లబ్ బలోపేతానికి భాగస్వాములు కావాలని కోరారు.

జర్నలిస్టులు, ప్రజలు ప్రెస్ మీట్లు నిర్వహించు కునేందుకు ఆధునిక సదుపాయాలతో ప్రెస్ క్లబ్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫ్రీ వైఫై, మినరల్ వాటర్, ఏసీ – నాన్ ఏసీ హాళ్లు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల నిఘా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సాధారణ ప్రెస్ మీట్‌లకు రూ.600, కమర్షియల్ ప్రెస్ మీట్‌లకు రూ.1000 రుసుము నిర్ణయించినట్లు ఐ. ప్రభాకర్ వెల్లడించారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >