| Daily భారత్
Logo




తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

News

Posted on 2026-05-24 21:12:46

Share: Share


తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

146 యూనిట్ల రక్త సేకరణ, రక్తదానానికి కదిలిన కామారెడ్డి యువత

హెల్మెట్లను అందజేసి అభినందించిన పట్టణ సీఐ నరహరి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో,కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి లు పేర్కొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇచ్చిన కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి మాట్లాడుతూ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడడం కోసం ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి, డాక్టర్ అజయ్ పేరాల,డాక్టర్ ఎన్ బాలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, రక్తదానం చేసిన రక్త దాతలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఖర్చు వెనకడుగు వేయకుండా హెల్మెట్లను అందజేయడం సామాజిక బాధ్యత కు నిదర్శనమని అన్నారు యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాలి సమాజ హితం కోసము ముందుకు కదలాలని అన్నారు రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంసా పత్రాలను హెల్మెట్లను బహూకరించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ నీల బాలు, చిలువేరి మారుతి,డాక్టర్ అజయ్ పేరాల,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకటేష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరి శ్రీదేవి,కోశాధికారి రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ సభ్యులు డాక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్,అనంతుల అఖిల్,మందుల రామచంద్రం, బట్టు బరద్వాజ్,వంశీ,తల సేమియా బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >